...
...
Next Story

Uber Air : ఆకాశంలో ఎగిరే ట్యాక్సీలు- 'ఉబర్ ఎయిర్' సేవలు ప్రారంభం! ట్రాఫిక్​ కష్టాలకు చెక్​..

ప్రముక ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ సంస్థ 'జోబీ ఏవియేషన్' భాగస్వామ్యంతో ఉబర్ తన వినూత్న 'ఉబర్ ఎయిర్' సేవలను లాంచ్ చేసింది. నేరుగా ఉబర్ యాప్ ద్వారానే ఈ ఎలక్ట్రిక్ విమానాలను బుక్ చేసుకునే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Feb 26, 2026 07:30 AM IST
Advertisement

సిటీలో ఒక చోట నుంచి మరో చోటికి వెళ్లాలంటే గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయే రోజులకు ఇక కాలం చెల్లనుంది! ప్రముఖ రైడ్ హెయిలింగ్ దిగ్గజం ఉబర్, తన ప్లాట్‌ఫామ్‌పై సరికొత్త 'ఉబర్ ఎయిర్' సేవలను పరిచయం చేసింది. జోబీ ఏవియేషన్ రూపొందించిన ఈ ఆల్-ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలు ఈ ఏడాది చివరలో దుబాయ్‌లో తొలిసారిగా ప్రయాణికులను మోసుకెళ్లనున్నాయి. నగర రవాణా వ్యవస్థలో ఇదొక చారిత్రాత్మక మార్పుగా నిలవనుంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవస్థ గురించి ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

ఉబర్ ఎయిర్ ఎలా పనిచేస్తుంది?

ఉబర్ తన వినూత్న 'ఉబర్ ఎయిర్' సేవలను (Representative image)
ఉబర్ తన వినూత్న 'ఉబర్ ఎయిర్' సేవలను (Representative image)

ప్రయాణికులు తమ ఫోన్‌లోని ఉబర్ యాప్‌ను ఓపెన్ చేసి, డెస్టినేషన్‌ను ఎంటర్ చేసినప్పుడు.. ఆ రూట్‌లో ఎయిర్ టాక్సీ సదుపాయం ఉంటే 'Uber Air powered by Joby' అనే ఆప్షన్ కనిపిస్తుంది. కేవలం ఒక్క ట్యాప్‌తో దీన్ని బుక్ చేసుకోవచ్చు. ఈ ప్రయాణంలో మీ ఇంటి వద్ద నుంచి విమానం ఎక్కే పాయింట్ (వెర్టిపోర్ట్) వరకు వెళ్లడానికి ఉబర్ బ్లాక్ కారు, ఆ తర్వాత ఎయిర్ టాక్సీ ప్రయాణం.. ఇలా మొత్తం ప్రయాణం ఒకే బుకింగ్‌తో పూర్తవుతుంది.

ఎయిర్ టాక్సీ ప్రత్యేకతలు ఇవే:

జోబీ రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ విమానం అత్యాధునిక సాంకేతికతతో అందుబాటులోకి వస్తుంది.

సామర్థ్యం: ఒక పైలట్, నలుగురు ప్రయాణికులు ప్రయాణించవచ్చు.

వేగం: గంటకు గరిష్టంగా 322 కిలోమీటర్ల (200 ఎంపీహెచ్​) వేగంతో ప్రయాణిస్తుంది.

రేంజ్​: ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే సుమారు 160 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లగలదు.

నిశ్శబ్ద ప్రయాణం: సాధారణ హెలికాప్టర్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ శబ్దం చేస్తుంది. నగర వాతావరణంలో ఇతరులకు ఇబ్బంది కలగకుండా దీని సౌండ్ ప్రొఫైల్‌ను డిజైన్ చేశారు.

దుబాయ్‌తో పాటు న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, యునైటెడ్ కింగ్‌డమ్, జపాన్ వంటి మార్కెట్లలో కూడా ఈ సేవలను ప్రారంభించాలని ఉబర్ లక్ష్యంగా పెట్టుకుంది. అమెరికాలో వాణిజ్యపరంగా ఈ సేవలు మొదలవ్వాలంటే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్​ఏఏ) ధృవీకరణ అవసరం. జోబీ ఏవియేషన్ ఇప్పటికే 50,000 మైళ్ల ఫ్లైట్ టెస్టింగ్‌ను పూర్తి చేసి, సర్టిఫికేషన్ ప్రక్రియలో తుది దశకు చేరుకుంది.

గతంలో ఉబర్ తన ‘ఎలివేట్’ విభాగం ద్వారా ఈ ప్రాజెక్టును మొదలుపెట్టగా, 2021లో జోబీ ఏవియేషన్ ఆ విభాగాన్ని కొనుగోలు చేసింది. తాజాగా 'బ్లేడ్' ప్యాసింజర్ బిజినెస్‌ను కూడా తనలోకి విలీనం చేసుకోవడంతో, 2026 నాటికి గ్లోబల్ మార్కెట్‌లో ఉబర్ ఎయిర్ సేవలు మరింత వేగవంతం కానున్నాయి.

ఈ సర్వీస్​ ఇండియాలోకి ఎప్పుడొస్తుంది? అనేది వేచి చూడాల్సిన అంశం.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

ప్రశ్న- దుబాయ్‌లో ఈ ఎయిర్ టాక్సీ సేవలు ఏ రూట్లలో అందుబాటులో ఉంటాయి?

సమాధానం- ప్రారంభంలో దుబాయ్‌లోని నాలుగు ప్రధాన కేంద్రాలను కలుపుతూ ఈ సేవలు సాగనున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి పామ్ జుమేరా, డౌన్‌టౌన్ దుబాయ్, దుబాయ్ మెరీనా ప్రాంతాలకు ఈ ఎయిర్ టాక్సీలు ప్రయాణిస్తాయి. దీనివల్ల రోడ్డు మార్గంలో గంటల తరబడి పట్టే ప్రయాణ సమయం కేవలం 10 నుంచి 15 నిమిషాలకు తగ్గిపోతుంది.

ప్రశ్న- ఉబర్ ఎయిర్ ప్రయాణానికి ఎంత ఖర్చవుతుంది? సామాన్యులకు అందుబాటులో ఉంటుందా?

సమాధానం- ప్రారంభ దశలో వీటి ధరలు ఉబర్ బ్లాక్ వంటి ప్రీమియం సేవల కంటే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దుబాయ్‌లో చిన్న దూరం ప్రయాణానికి (ఉదాహరణకు దుబాయ్ మెరీనా నుంచి పామ్ జుమేరాకు) సుమారు డీహెచ్​ఎస్​ 300 నుంచి 400 (సుమారు 7,000 - 9,000) వరకు ఉండవచ్చని అంచనా. అయితే, భవిష్యత్తులో విమానాల సంఖ్య పెరిగే కొద్దీ ఈ ధరలు సాధారణ ఉబర్ రైడ్ ధరలకు దగ్గరగా తగ్గుతాయని కంపెనీ భావిస్తోంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe