ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డిపై సుమోటో కేసులు నమోదు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఖమ్మం బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు హింస, రాజకీయ విద్వేషాలు పెంచేలా ఉన్నాయన్నారు. వ్యాఖ్యలు ప్రచారం చేసిన సోషల్ మీడియా, మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం వ్యాఖ్యలపై డీజీపీ కార్యాలయంలో బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. అన్ని జిల్లా కేంద్రాల్లోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్.. ముఖ్యమంత్రికి ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు.

ముఖ్యమంత్రి హోదాలో ఉండి పాతిపెట్టండి, బొంద పెట్టండి, దిమ్మలు కూల్చండి వంటి హింసాత్మక పదజాలం వాడటం చూస్తుంటే మీరు ముఖ్యమంత్రిలా కాకుండా ఒక ఫ్యాక్షన్ ముఠా నాయకుడిలా కనిపిస్తున్నారని దాసోజు శ్రవణ్ విమర్శించారు. ఇది కేవలం రాజకీయ ప్రసంగం కాదని, సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టే నేరపూరిత కుట్ర అని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి తీరును చూస్తుంటే.. అధికారం కాంగ్రెసే కానీ, ఆత్మ మాత్రం టీడీపీదే అని శ్రవణ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ జెండా కప్పుకొని, లోపల తన పాత యజమాని చంద్రబాబు నాయుడు అజెండాను అమలు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. తన ప్లాన్-బిలో భాగంగా టీడీపీని మళ్లీ లేపేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారన్నారు.
కాంగ్రెస్ను తన గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి సీనియర్ నేతలైన భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారిని క్రమపద్ధతిలో బలహీనపరుస్తున్నారని దాసోజు శ్రవణ్ ఆరోపణలు చేశారు. ఢిల్లీ అధిష్టానానికి పంగనామాలు పెడుతూ, ఇటు టీడీపీతో అటు బీజేపీతో కోవర్ట్ సంబంధాలు నెరుపుతున్నారని విమర్శించారు.
రాష్ట్రం ఆర్థికంగా అధోగతి పాలవుతున్నా, సంపద సృష్టించడం తెలియక ఫ్యూచర్ సిటీ, 5 ట్రిలియన్ ఎకానమీ అంటూ రేవంత్ ప్రజలకు రంగుల కలలు చూపిస్తున్నారని విమర్శించారు. రిటైర్డ్ ఉద్యోగులకు కనీసం బెనిఫిట్స్ ఇవ్వలేని స్థితిలో ఉండి, పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు.
{{/usCountry}}రాష్ట్రం ఆర్థికంగా అధోగతి పాలవుతున్నా, సంపద సృష్టించడం తెలియక ఫ్యూచర్ సిటీ, 5 ట్రిలియన్ ఎకానమీ అంటూ రేవంత్ ప్రజలకు రంగుల కలలు చూపిస్తున్నారని విమర్శించారు. రిటైర్డ్ ఉద్యోగులకు కనీసం బెనిఫిట్స్ ఇవ్వలేని స్థితిలో ఉండి, పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు.
{{/usCountry}}'తెలంగాణ విముక్తి కోసం సర్వస్వం త్యాగం చేసిన కేసీఆర్ ప్రజల గుండెల్లో తెలంగాణ జాతిపితగా ఎప్పటికీ నిలిచి ఉంటారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన బీఆర్ఎస్ పార్టీని తిట్టడం సరికాదు. అధికారం శాశ్వతం కాదు, మీ అహంకారమే మీ వినాశనానికి దారితీస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి తన తీరు మార్చుకోవాలి.' అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ దాసోజు పేర్కొన్నారు.