...
...
Next Story

మైథలాజికల్ థ్రిల్లర్‌గా శ్రద్ధా దాస్ త్రికాల- సీనియర్ హీరోయిన్ ఆమని కీలక పాత్ర- రిలీజ్ ఎప్పుడంటే?

హీరోయిన్ శ్రద్దా దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన మైథలాజికల్ థ్రిల్లర్ సినిమా త్రికాల. మణి తెల్లగూటి దర్శకత్వంలో రాధిక శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. తాజాగా డిసెంబర్‌లో త్రికాల మూవీని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Published on: Nov 24, 2025 08:32 PM IST
Advertisement

ప్రస్తుతం మైథలాజికల్ టచ్ ఉన్న పాయింట్‌తో వచ్చే చిత్రాలకు మంచి డిమాండ్ ఉంటోంది. ఆడియెన్స్ కూడా ఈ ఫిక్షనల్ జోనర్ చిత్రాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే బ్యూటిపుల్ హీరోయిన్ శ్రద్ధా దాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సినిమా త్రికాల.

త్రికాల నటీనటులు

మైథలాజికల్ థ్రిల్లర్‌గా శ్రద్ధా దాస్ త్రికాల- సీనియర్ హీరోయిన్ ఆమని కీలక పాత్ర- రిలీజ్ ఎప్పుడంటే?
మైథలాజికల్ థ్రిల్లర్‌గా శ్రద్ధా దాస్ త్రికాల- సీనియర్ హీరోయిన్ ఆమని కీలక పాత్ర- రిలీజ్ ఎప్పుడంటే?

రిత్విక్ వేట్షా సమర్పణలో రాధిక, శ్రీనివాస్ నిర్మాతలుగా శ్రీ సాయిదీప్ చాట్లా, వెంకట్ రమేష్ దాడి సహ నిర్మాతలుగా ‘త్రికాల’ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ మూవీకి మణి తెల్లగూటి దర్శకత్వం వహిస్తున్నారు. త్రికాల సినిమాలో శ్రద్దా దాస్‌తోపాటు మాస్టర్ మహేంద్రన్, అజయ్, సాహితి అవంచ, సీనియర్ హీరోయిన్ ఆమని, ప్రభాకర్, అంబటి అర్జున్, రౌడీ రోహిణి వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు.

త్రికాల ట్రైలర్‌కు రెస్పాన్స్

ఇప్పటికే రిలీజ్ చేసిన త్రికాల ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మాస్టర్ మహేంద్రన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్, నటుడు అజయ్ విశ్వరూపం, సినిమాలోని డైలాగ్స్, శ్రద్దా దాస్ మేకోవర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ట్రైలర్‌తోనే సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది.

అర్జున్ రెడ్డి, యానిమల్ మ్యూజిక్ డైరెక్టర్

ఒక్క ట్రైలర్‌తోనే ఏకంగా నార్త్ ఇండియాలోనూ ‘త్రికాల’ బిజినెస్ జరిగిపోయింది. ప్రస్తుతం అన్ని చోట్లా ‘త్రికాల’ మీద మంచి డిమాండ్ ఏర్పడింది. త్రికాల సినిమాకు అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన నేషనల్ అవార్డ్ విన్నర్ హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం అందించడం విశేషం.

స్పెషల్ అట్రాక్షన్‌గా

‘త్రికాల’ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం పూర్తి అయ్యాయి. ఇక మరో వైపు ప్రమోషన్స్ కార్యక్రమాల్ని కూడా పెంచే పనిలో పడ్డారు దర్శకనిర్మాతలు. ఒక్కో పాటను రిలీజ్ చేస్తూ సినిమాపై మరింత బజ్‌ను క్రియేట్ చేయాలని టీమ్ ప్రయత్నిస్తోంది. డిసెంబర్ నెలలో త్రికాల సినిమా థ్రియేట్రికల్ రిలీజ్ కానుంది.

అల్లరి నరేష్ సినిమాతో

ఇదిలా ఉంటే త్రికాల సినిమాకు షాజిత్ హుమాయున్ బీజీఎమ్ అందించగా.. కెమెరా వర్క్‌ను పవన్ చెన్నా నిర్వర్తిస్తున్నారు. డైరెక్టర్ మణి తెల్లగూటి ఎడిటింగ్ బాధ్యతలు స్వీకరించారు. ఇకపోతే అల్లరి నరేష్ నటించిన సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా దాస్.

శ్రద్ధా దాస్ సినిమాలు

ఆ తర్వాత ఆర్య 2 సినిమాలో శాంతి పాత్రలో టాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది బ్యూటిపుల్ శ్రద్ధా దాస్. హిందీలో జిద్ సినిమాతో కూడా అలరించిన శ్రద్ధా దాస్ గుంటూర్ టాకీస్, ఏక్ మినీ కథ, డార్లింగ్, పున్నమి రాత్రి, డిక్టేటర్, నాగవల్లి వంటి సినిమాల్లో యాక్ట్ చేసింది. గతేడాది పారిజాత పర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది శ్రద్ధా దాస్.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe